పాన్ కార్డుతో ఆధార్ లింక్ ఇలా..
- December 17, 2020
న్యూ ఢిల్లీ:పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవడానికి విధించిన చివరి తేదీ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే సంవత్సరం అనగా 2021 మార్చి 31వ తేదీ వరకు పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవచ్చని తెలిపింది. నిజానికి ఈ లింక్ కి సంబంధించిన చివరి తేదీని 2020 జూన్ 30వరకే నిర్ణయించింది. కానీ ప్రస్తుతం ఈ తేదీని పొడిగించింది. ఇప్పటివరకూ ఎవరైతే పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోలేదో, వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు.
ఈ లింక్ పూర్తి కాకపోతే భవిష్యత్తులో పాన్ కార్డు అవసరమయ్యే దగ్గర ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉండవని అంటున్నారు. బ్యాంకు ట్రాన్సాక్షన్లలో పాన్ కార్డు అవసరం చాలా ఉంటుంది. ఖాతా ఓపెన్ చేయడానికి గానీ, పరిమితికి మించి డబ్బు జమ చేయాలన్నా, తీసుకోవాలన్న పాన్ కార్డ్ కంపల్సరీ. పాన్ కార్డుతో ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకపోతే ఇలాంటి సదుపాయాలకి భంగం కలుగుతుందట.
ఆదాయ పన్ను కడుతున్న వారు, ప్రత్యేకంగా లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వారు టాక్స్ ఫైల్ చేసినపుడే ఆధార్ తో లింక్ చేసి ఉంచుతారు. లింక్ చేసారా లేదా అని తెలుసుకోవడానికి ఈ వెబ్ సైట్ http://www.incometaxindiaefiling.gov.inలోకి లాగ్ ఇన్ అయితే తెలిసిపోతుంది. లాగ్ ఇన్ అయ్యాక మీ పాన్ కార్డుతో అధార్ లింక్ లేదని తెలిస్తే, అక్కడ ఒక ఫామ్ ఉంటుంది. దానిలో ఉన్న వివరాలన్నింటినీ పూర్తి చేస్తే పాన్ కార్డుతో ఆధార్ లింక్ అయిపోతుంది.
ఒకవేళ మీరు ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయకపోతే, ముందుగా ఈ https://incometaxindiaefiling.gov.in/ సైటులోకి ఎంటర్ అవ్వండి.
మెనూ లో ఉన్న ఆధార్ లింక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
అప్పుడు తెరపై మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, పేరు తెలియజేయండి.
మీ ఆధార్ కార్డులో కేవలం మీరు పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే, అక్కడ ఉన్న అదే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
అన్ని వివరాలు సరిగ్గా ఇచ్చారో లేదో ఒకసారి చూసుకున్నాక సబ్మిట్ నొక్కండీ.అంతే, మీ పాన్ కార్డుకి ఆధార్ లింక్ అయ్యిందని మెసేజ్ వచ్చేస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







