సుప్రీం కమిటీ మార్గదర్శకాల ఉల్లంఘన: ఆరుగురు దోషులుగా నిర్ధారణ

- December 18, 2020 , by Maagulf
సుప్రీం కమిటీ మార్గదర్శకాల ఉల్లంఘన: ఆరుగురు దోషులుగా నిర్ధారణ

మస్కట్‌:సుప్రీం కమిటీ మార్గదర్శకాల్ని ఉల్లంఘించారంటూ ఆరుగురు వ్యక్తులపై నమోదైన కేసుల్లో న్యాయస్థానం విచారణ జరిపింది, నిందితుల్ని దోషులుగా నిర్ధారించింది. మూడు నెలల వరకు జైలు శిక్ష అలాగే 1000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధించింది న్యాయస్థానం దోషులకు. మస్కట్‌, అల్‌ దఖ్లియా, సౌత్‌ షర్కియాలలో నిందితులు ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆయా గవర్నరేట్స్‌లోని న్యాయస్థానాలు నిర్ధారించడం జరిగింది. మాస్క్‌లు ధరించకపోవడం, మూమెంట్‌ బ్యాన్‌ నిబంధనల్ని ఉల్లంఘించడం వంటి నేరాలకు నిందితులు పాల్పడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com