తెలంగాణాలో కొత్తగా 627 కరోనా కేసులు...
- December 19, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి... వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 627 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. నలుగురు మృతిచెందారు.. ఇదే సమయంలో 721 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,80,822 కు పెరగగా.. ఇప్పటి వరకు 1,489 మంది కరోనాతో మృతిచెందారు.. 2,72,370 మంది రికవరీ అయ్యారు.. ఇక, కరోనా మరణాలు దేశంలో 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉన్నాయిన.. రికవరీ రేటు దేశంలో 96.99 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 95.5 శాతానికి పెరిగిందని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,942 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 4,814 హోం ఐసోలేషన్లోనే ఉన్నారు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 46,694 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... టెస్ట్ల సంఖ్య 64,01,082 కు చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!