తెలంగాణాలో కొత్తగా 627 కరోనా కేసులు...

- December 19, 2020 , by Maagulf
తెలంగాణాలో కొత్తగా 627 కరోనా కేసులు...

హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి... వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 627 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. నలుగురు మృతిచెందారు.. ఇదే సమయంలో 721 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,80,822 కు పెరగగా.. ఇప్పటి వరకు 1,489 మంది కరోనాతో మృతిచెందారు.. 2,72,370 మంది రికవరీ అయ్యారు.. ఇక, కరోనా మరణాలు దేశంలో 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉన్నాయిన.. రికవరీ రేటు దేశంలో 96.99 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 95.5 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,942 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 4,814 హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 46,694 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... టెస్ట్‌ల సంఖ్య 64,01,082 కు చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com