టర్కీ కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
- December 19, 2020
అంకారా:టర్కీ దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలను కోల్పోయారు. దక్షిణ టర్కీలోని కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో శనివారం మంటలు చెలరేగాయి. ఆక్సిజన్ సిలిండర్ పేలి 9 మంది మృతి చెందారని ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు.
ఇస్తాంబుల్కు ఆగ్నేయంగా 850 కిలోమీటర్లు దూరంలోని గాజియాంటెప్లోని ప్రైవేటుగా నడుస్తున్న సాంకో యూనివర్శిటీ హాస్పిటల్ యూనిట్ వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగిందని ప్రభుత్వ అనడోలు వార్తా సంస్థ తెలిపింది. కరోనా బారినపడ్డ బాధితులు 56 నుంచి 85 మధ్య ఉన్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను త్వరగా అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







