కోవిడ్ 19: అబుధాబి కొత్త ట్రావెల్ రూల్స్
- December 23, 2020
అబుధాబి: అబుధాబి క్రైసిస్, ఎమర్జన్సీస్ మరియు డిజాస్టర్ కమిటీ, తాజాగా ప్రివెంటివ్ మరియు ప్రికాషనరీ మెజర్స్కి సంబంధించి మరిన్ని కొత్త అంశాల్ని వెల్లడించడం జరిగింది. ఆర్థిక, పర్యాటక అలాగే వినోద కార్యక్రమాలకు సంబంధించి ఆపరేషనల్ కెపాసిటీని పెంచేలా కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. పిసిఆర్ లేదా డిపిఐ టెస్ట్ రిజల్ట్కి సంబంధించి 48 గంటల వ్యవధిని 72 గంటలకు పెంచారు. ప్రస్తుతం 4 అలాగే 8వ రోజు ప్రయాణీకులకు టెస్ట్ చేస్తుండగా, ఇకపై 6వ రోజున టెస్ట్ చేస్తారు. క్వారంటైన్ నిబంధనలు విషయానికొస్తే, గ్రీన్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు క్వారంటైన్ని 10 రోజులకు కుదించారు. ఆరు రోజుల కంటే ఎక్కువగా వుంటే, ఆరవ రోజున పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. ఒకవేళ 12 రోజుల వరకు వుంటే, 12వ రోజు కూడా టెస్ట్ చేయించుకోవాలి. 10 రోజుల క్వారంటైన్ అలాగే 8వ రోజున కరోనా టెస్ట్ చేయించుకోవడాన్ని అంతర్జాతీయ ప్రికాషనరీ మెజర్గా పేర్కొంటున్నారు. నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లో పాల్గొనేవారికి కొన్ని మినహాయింపులిస్తున్నారు. సెహ(SEHA) టెస్టింగ్ సెంటర్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
గ్రీన్ లిస్ట్ దేశాలు:ఆస్ట్రేలియా,బ్రూనై,చైనా,గ్రీస్,గ్రీన్లాండ్,హాంగ్ కాంగ్,మలేషియా,మారిషస్,న్యూ జీలాండ్,సౌదీ అరేబియా,సింగపూర్,టైవాన్,టజీకిస్తాన్,థాయిలాండ్,ఉజ్బెకిస్తాన్,వియత్నాం
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







