ట్రెయిన్ హోస్టెస్లు త్వరలో రానున్నారు
- February 21, 2016
విమానాల్లో లాగే త్వరలో రైలు ప్రయాణికుల కోసం ట్రెయిన్ హోస్టెస్లు రానున్నారు. దేశంలో దిల్లీ- ఆగ్రాల మధ్య నడిచే మొదటి సెమీ హైస్పీడ్ రైలు అయిన గతిమాన్ ఎక్స్ప్రెస్లో ఈ ట్రెయిన్ హోస్టెస్ల ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. మార్చిలో ఈ రైలు సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ రైల్లో హై-పవర్ అత్యవసర బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారం, స్లైడింగ్ ద్వారాలతో పాటు లైవ్ టీవీ సౌకర్యం ఉంది. విమాన సర్వీసుల్లాగే గతిమాన్ రైల్లో క్యాటరింగ్ సర్వీసుతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేస్తోంది.ఈ విశేషాలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వచ్చే రైల్ బడ్జెట్లో ప్రకటించనున్నారు.టికెట్ ధర శతాబ్ది ఎక్స్ప్రెస్ ధర కంటే 25 శాతం ఎక్కువగా ఉంటుంది. క్యాటరింగ్లో భారతీయ, విదేశీ వంటకాలు ఉంటాయి. ఇలాంటి రైళ్లను కాన్పూర్-దిల్లీ, ఛండీగడ్-దిల్లీ,హైదరాబాద్-చెన్నై, నాగ్పూర్-బిలాస్పూర్, గోవా-ముంబయి, నాగ్పూర్-సికింద్రాబాద్ల మధ్య కూడా నడపాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







