ట్రెయిన్‌ హోస్టెస్‌లు త్వరలో రానున్నారు

- February 21, 2016 , by Maagulf
ట్రెయిన్‌ హోస్టెస్‌లు త్వరలో  రానున్నారు

విమానాల్లో లాగే త్వరలో రైలు ప్రయాణికుల కోసం ట్రెయిన్‌ హోస్టెస్‌లు రానున్నారు. దేశంలో దిల్లీ- ఆగ్రాల మధ్య నడిచే మొదటి సెమీ హైస్పీడ్‌ రైలు అయిన గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ట్రెయిన్‌ హోస్టెస్‌ల ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. మార్చిలో ఈ రైలు సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ రైల్లో హై-పవర్‌ అత్యవసర బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఆటోమేటిక్‌ ఫైర్‌ అలారం, స్లైడింగ్‌ ద్వారాలతో పాటు లైవ్‌ టీవీ సౌకర్యం ఉంది. విమాన సర్వీసుల్లాగే గతిమాన్‌ రైల్లో క్యాటరింగ్‌ సర్వీసుతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేస్తోంది.ఈ విశేషాలను రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు వచ్చే రైల్‌ బడ్జెట్‌లో ప్రకటించనున్నారు.టికెట్‌ ధర శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ధర కంటే 25 శాతం ఎక్కువగా ఉంటుంది. క్యాటరింగ్‌లో భారతీయ, విదేశీ వంటకాలు ఉంటాయి. ఇలాంటి రైళ్లను కాన్పూర్‌-దిల్లీ, ఛండీగడ్‌-దిల్లీ,హైదరాబాద్‌-చెన్నై, నాగ్‌పూర్‌-బిలాస్‌పూర్‌, గోవా-ముంబయి, నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌ల మధ్య కూడా నడపాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com