తెలంగాణ లో స్వల్పంగా తగ్గిన కేసులు

- December 25, 2020 , by Maagulf
తెలంగాణ లో స్వల్పంగా తగ్గిన కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.  రాష్ట్రంలో తాజాగా 518 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,074కి చేరింది.  ఇందులో 2,75,708 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,839కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటె, తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు.  దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1527కి చేరింది.  తాజా బులెటిన్ ప్రకారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 491 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com