హైదరాబాద్:ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసిన సోనూసూద్..
- December 26, 2020
హైదరాబాద్:కరోనా సమయంలో వలసకార్మికులకు కొండంత అండగా నిలబడి వారిని ఆదుకున్నారు. లాక్ డౌన్ మొదలైన నాటినుండి ఆయన ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలించడానికి ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసాడు. ఇక ఇప్పుడు ఏకంగా కేరళలో చిక్కుకున్న ఒడిస్సా అమ్మాయిలను సొంత గ్రామాలకు చేర్చడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసాడు.విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. అంతే కాకుండా కష్టాలు చెప్పుకున్న ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేసాడు . రీల్ లో చేసేది విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం సూపర్ హీరో అనిపించుకున్నాడు. దేశమంతా సోనూసూద్ ను ప్రశంశలతో ముంచేస్తుంది. ఇటీవల సోనూసూద్ కు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గుడి కట్టించిన సంగతి తెలిసిందే. అయితే... తాజాగా హైదరాబాద్ లోని బేగంపేట కు చెందిన అనిల్ అనే యువకుడు తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సోను సూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పేరు పెట్టడం జరిగింది. సోను సూద్ పేరు పెట్టడంతో తనకు బిజినెస్ రెట్టింపు అయ్యిందని అనిల్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని బేగంపేటలో ని సోనూసూద్ పాస్ట్ ఫుడ్ సెంటర్ ను సోనూసూద్ సడన్ విజిట్ చేశారు.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









