ఇరాన్లో 10 మంది పర్వాతారోహకులు మృతి
- December 27, 2020
తెహ్రాన్:ఇరాన్ రాజధాని తెహ్రాన్కు ఉత్తరాన ఉన్న పర్వతాలలో సుమారు 10 మంది పర్వాతారోహకులు మృతి చెందారు. భారీ హిమపాతం కారణంగా వీరు మరణించారని స్థానిక మీడియాలో వార్తలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇరాన్లోని పలు ప్రాంతాలు భారీ హిమపాతంతో తడిసి ముద్దవుతున్నాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అనేక రహదారులను మూసివేశారు. తెహ్రాన్లోని ఆల్బోర్జ్ పర్వతాన్ని ఎక్కేందుకు వచ్చిన తొమ్మిది మంది భారీ హిమపాతంలో చిక్కుకుపోయి చనిపోగా..మరొకరిని రక్షించినప్పటికీ..చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







