దుబాయ్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు..ఉల్లంఘిస్తే Dh50,000 ఫైన్
- December 27, 2020
దుబాయ్:కోవిడ్ రూపాంతరం చెంది మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో దుబాయ్ అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించింది. ప్రైవేట్ పార్టీలు, న్యూ ఇయర్ వేడుకల్లో 30 మందికి మించి పాల్గొనేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. పరిమిత సంఖ్యకు మించి జరుపుకునే సెలబ్రేషన్స్ కు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతి ఇచ్చేది లేదని కూడా తేల్చి చెప్పింది. అంతేకాదు..30 మంది లోపు హజరయ్యే వేడుకల్లోనూ భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని, ప్రతీ వ్యక్తికి మీటర్ దూరం ఎడం ఉండాలని దుబాయ్ సుప్రీం కమిటీ క్లారిటీ ఇచ్చింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాల్సి ఉంటుంది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు పార్టీలకు వెళ్లకుండా ఉండటమే మంచిదని కమిటీ సూచించింది. ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేందుకు తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తామని తెలిపింది. ఎవరైనా సుప్రీం కమిటీ సూచనలను పాటించకపోతే వేడుక నిర్వాహకులకు Dh50,000, వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి Dh 15,000 చొప్పున ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







