దుబాయ్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు..ఉల్లంఘిస్తే Dh50,000 ఫైన్
- December 27, 2020
దుబాయ్:కోవిడ్ రూపాంతరం చెంది మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో దుబాయ్ అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించింది. ప్రైవేట్ పార్టీలు, న్యూ ఇయర్ వేడుకల్లో 30 మందికి మించి పాల్గొనేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. పరిమిత సంఖ్యకు మించి జరుపుకునే సెలబ్రేషన్స్ కు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతి ఇచ్చేది లేదని కూడా తేల్చి చెప్పింది. అంతేకాదు..30 మంది లోపు హజరయ్యే వేడుకల్లోనూ భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని, ప్రతీ వ్యక్తికి మీటర్ దూరం ఎడం ఉండాలని దుబాయ్ సుప్రీం కమిటీ క్లారిటీ ఇచ్చింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాల్సి ఉంటుంది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు పార్టీలకు వెళ్లకుండా ఉండటమే మంచిదని కమిటీ సూచించింది. ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేందుకు తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తామని తెలిపింది. ఎవరైనా సుప్రీం కమిటీ సూచనలను పాటించకపోతే వేడుక నిర్వాహకులకు Dh50,000, వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి Dh 15,000 చొప్పున ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









