తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ క్రికెట్ లీగ్ -1..టైటిల్ విజేత కెఆర్సిసి
- December 27, 2020దోహా: ప్రతి సంవత్సరం ఖతార్ లో నివసించే తెలుగు ఆటగాళ్లందరిని ఒక వేదిక మీదకు చేర్చుతుంది ఈ క్రికెట్ లీగ్. తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ క్రికెట్ లీగ్ -1 (టిడబ్ల్యుఎ సిఎల్ -1) లో 10 జట్లు పాల్గొన్నాయని టిడబ్ల్యుఎ కార్యదర్శి మహ్మద్ షోయిబ్ స్పోర్ట్స్ అండ్ యూత్ యాక్టివిటీస్ కార్యదర్శి తెలిపారు. టిడబ్ల్యుఎ వారి వివిధ సంక్షేమ కార్యకలాపాల్లో భాగంగా కార్మికుల కోసం నామమాత్రపు ప్రవేశ రుసుము మరియు కొన్ని జట్లకు సబ్సిడీ రుసుముతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. ఇది నాకౌట్ టోర్నమెంట్.
ఈ టోర్నమెంట్లో కెఆర్సిసి జట్టు విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ఉత్తమ బౌలర్, ఉత్తమ బ్యాట్స్ మాన్ మరియు ఉత్తమ మద్దతుదారు, టోర్నమెంట్ కోసం రన్నర్ మరియు విజేతలకు బహుమతులు పంపిణీ చేయబడ్డాయి. అతిథులు మరియు స్పాన్సర్లు పాల్గొన్న గొప్ప కార్యక్రమంలో బహుమతులు పంపిణీ చేశారు. ఖజా నిజాముద్దీన్ (ప్రెసిడెంట్ టిడబ్ల్యుఎ) విజేతలుగా నిలిచిన కెఆర్సిసి ని అభినందించారు.
క్రీడలను ప్రోత్సహించడానికి మరియు ఖతార్లోని తెలుగు కమ్యూనిటీ మధ్య సంబంధాన్ని పెంపొందించడానికి ఈ టోర్నమెంట్ జరిగింది. అన్ని కోవిడ్ -19 మార్గదర్శకాలను అనుసరించి ఖతార్లోని తెలుగు కమ్యూనిటీకి చెందిన తక్కువ వేతన కార్మికుల కోసం టిడబ్ల్యుఎ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్లో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేసిన స్పాన్సర్లకు మరియు పది జట్లకు కృతజ్ఞతలు తెలిపారు అస్సోసియేషన్ ప్రెసిడెంట్.
ఈ టోర్నమెంట్ కు ముఖ్యఅతిథి షెజీ వలియకాథ్ (వైస్ ప్రెసిడెంట్ ఐబిపిసి) మరియు అతిథి రజిని (ఐసిబిఎఫ్-ఖతార్) మేనేజింగ్ కమిటీ సభ్యురాలు, అబ్దుల్ ఖాదర్ (ఐడీఎల్ హోమ్ బిల్డర్స్), మహ్మద్ అనీస్ (దక్కన్ హౌస్), ముస్తఫా ఎల్ఎన్ మొహమ్మద్, బద్రుద్దీన్, అమీర్ లూత్ ఫే అహ్మద్ మరియు సయీద్ మహ్మద్ తదితరులు హాజరయ్యారు. టోర్నమెంట్ను గొప్ప విజయవంతంగా నిర్వహించిన క్రీడలు మరియు యువజన కార్యకలాపాల కార్యదర్శి మిస్టర్ షోయిబ్, టోర్నమెంట్ నిర్వాహకులు తాహా మరియు మిస్టర్ రమేష్ పిట్ల మరియు టిడబ్ల్యుఎ బృందానికి, ధన్యవాదాలు తెలిపారు ఖజా నిజాముద్దీన్.
--వనంబత్తిన రాజ్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్ )
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్