విశ్వక్సేన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
- December 28, 2020హైదరాబాద్:టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు పీవీపీ సినిమా,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై యంగ్ హీరో విశ్వక్సేన్ కథానాయకుడిగా కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. తమిళంలో సూపర్హిట్ అయిన ఓ మై కడవులే సినిమాకు ఇది రీమేక్. తమిళంలో ‘ఓ మై కడవులే’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగులోనూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముహర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తుకి దిల్రాజు స్క్రిప్ట్ను అందించారు. ఫిబ్రవరి మూడో వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
బెస్ట్ డైలాగ్ రైటర్గా నేషనల్ అవార్డ్ను అందుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాటలను అందించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..