ఏపీలో కరోనా కేసుల వివరాలు...

- December 28, 2020 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు...

అమరావతి:ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది.రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోయాయి.ప్రస్తుతం ఏపీలో 500 కంటే తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నా, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఇవాళ కొత్తగా 212 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,78,378 పాజిటివ్ కేసు లకు గాను.. 8,67,857 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 3, 423 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో నలుగురు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 7,098 కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అత్యధికంగా గుంటూరు జిల్లాలో 53 కేసులు నమోదయ్యాయి.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com