రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్...!
- December 29, 2020మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను కరోనా వైరస్ కాటేసింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం ఉదయం వెల్లడించారు.
తనకు కరోనా వైరస్ సోకిందనీ వెల్లడించారు. అయితే, తనకు కరోనా లక్షణాల్లో ఒక్కటి కూడా లేదని తెలిపారు. అయినప్పటికీ.. హోం క్వారంటైన్లోకి వెళ్లినట్టు చెప్పారు. అయితే, ఈ వైరస్ నుంచి త్వరగానే కోలుకుని తిరిగివస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, ఇటీవల చెర్రీ తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో పాటు.. ఆయన సోదరుడు నాగబాబుకు కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. వీరంతా ఈ వైరస్ నుంచి కోలుకుని, ఇపుడు సాధారణ జీవితాన్ని అనుభవిస్తున్నారు.
కాగా, రామ్ చరణ్ ప్రభుత్వం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్. రెండోది తానే స్వయంగా తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య చిత్రం.
ఈ రెండు చిత్రాల షూటింగుల్లో చెర్రీ బిజీగా గడుపుతున్నారు. ఇక్కడ నుంచే ఆయనకు ఈ వైరస్ సోకివుంటుందని భావిస్తున్నారు.
కంగారులో మెగా ఫ్యామిలీ
ఇటీవల డిసెంబర్ 25న మెగా ఫ్యామిలీలోని యంగ్స్టర్స్ అందరూ కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
ఆ వేడుకల్లో చరణ్-ఉపాసన దంపతులతో పాటు పాటు అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులు, అల్లు బాబీ దంపతులు, శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక-చైతన్య దంపతులు, సుస్మిత దంపతులు, శ్రీజ దంపతులు.. ఇలా ఆ ఫ్యామిలీకి చెందిన పలువురు కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు చరణ్కు కొవిడ్-19గా నిర్ధారణ కావడంతో, ఆ వేడుకల్లో పాల్గొన్న వాళ్లంతా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడినట్లే.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్