‘మయూరి’ సుధకు ‘లెజెండ్’ అవార్డ్
- December 29, 2020భారతీయ నృత్యంలో మయూరి సుధాచంద్రన్కి ప్రత్యేక స్థానం ఉంది. యాక్సిడెంట్లో కాలు పోగా.. కృత్రిమ కాలు పెట్టుకొని నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయానికి గురిచేసిన గొప్ప నృత్య కళాకారిణి సుధాచంద్రన్. వెండితెరపై ఆమె జీవితం ఆవిష్కృతమైన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడామె బుల్లితెరపై కూడా తన ప్రతిభను చాటుతున్నారు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన సుధాచంద్రన్ను ఇప్పుడు ‘లెజెండ్‘ అవార్డ్ వరించింది.
వి.బి. ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డ్స్- 2020 ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బొప్పన కృష్ణ ఆధ్వర్యంలో డిసెంబర్ 27న హైదరాబాద్ శిల్పారామం, రాక్ హైట్స్లో ఈ వేడుకలు నిర్వహించబడినాయి. బుల్లితెర కళాకారుల ప్రతిభకు తగినట్లుగా ఈ వేడుకలో ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందచేశారు. ఇక నాట్యమయూరి సుధాచంద్రన్ను ఈ వేదికపై ‘లెజెండ్’ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును జీవితా రాజశేఖర్, బాబుమోహన్, శివాజీరాజా, అంజికా కృష్ణలు.. సుధాచంద్రన్కు అందజేశారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసి.. ఘనంగా సత్కరించిన వారందరికీ సుధాచంద్రన్ ధన్యవాదాలు తెలిపారు. పలు సీరియల్స్లో ఉత్తమ నటనను కనబరిచిన నటీనటులను ఈ అవార్డులు వరించాయి.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు