‘మయూరి’ సుధకు ‘లెజెండ్’ అవార్డ్
- December 29, 2020
భారతీయ నృత్యంలో మయూరి సుధాచంద్రన్కి ప్రత్యేక స్థానం ఉంది. యాక్సిడెంట్లో కాలు పోగా.. కృత్రిమ కాలు పెట్టుకొని నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయానికి గురిచేసిన గొప్ప నృత్య కళాకారిణి సుధాచంద్రన్. వెండితెరపై ఆమె జీవితం ఆవిష్కృతమైన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడామె బుల్లితెరపై కూడా తన ప్రతిభను చాటుతున్నారు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన సుధాచంద్రన్ను ఇప్పుడు ‘లెజెండ్‘ అవార్డ్ వరించింది.
వి.బి. ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డ్స్- 2020 ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బొప్పన కృష్ణ ఆధ్వర్యంలో డిసెంబర్ 27న హైదరాబాద్ శిల్పారామం, రాక్ హైట్స్లో ఈ వేడుకలు నిర్వహించబడినాయి. బుల్లితెర కళాకారుల ప్రతిభకు తగినట్లుగా ఈ వేడుకలో ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందచేశారు. ఇక నాట్యమయూరి సుధాచంద్రన్ను ఈ వేదికపై ‘లెజెండ్’ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును జీవితా రాజశేఖర్, బాబుమోహన్, శివాజీరాజా, అంజికా కృష్ణలు.. సుధాచంద్రన్కు అందజేశారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసి.. ఘనంగా సత్కరించిన వారందరికీ సుధాచంద్రన్ ధన్యవాదాలు తెలిపారు. పలు సీరియల్స్లో ఉత్తమ నటనను కనబరిచిన నటీనటులను ఈ అవార్డులు వరించాయి.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









