నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్
- December 31, 2020![1 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్](https://www.maagulf.com/godata/articles/202012/4977governorbiswabhusanharichandanfilephotofacebook_1609400407.jpg)
ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ నూతన సంవత్సరం ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. 2021 నూతన సంవత్సరం ఆగమనం నేపధ్యంలో గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తాజా పోకడలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు తమ వేడుకలను జరుపుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించాలని, నూతన సంవత్సర వేడుకలను సంయమనంతో జరుపుకోవాలని గౌరవ గవర్నర్ హరిచందన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతి సంవత్సరం నూతన సంవత్సర తొలి రోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో రాష్ట్ర ప్రజలు గవర్నర్ ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షాలు తెలపటం అనవాయితీ కాగా, కరోనా నేపధ్యంలో ఈ విడత ఆకార్యక్రమానికి రాజ్ భవన్ దూరంగా ఉండనుందని గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ జనసేన ఆధ్వర్యంలో 100 % strike సెలెబ్రేషన్స్
- సీఎం రేవంత్ రెడ్డితో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ భేటీ
- రెవిన్యూ, వసతి మరియు ఐటి విభాగాలను సమీక్షించిన TTD EO
- ట్యాక్స్ పేయర్ల కోసం కొత్త ‘ఏఐఎస్’ యాప్..
- వయోవృద్ధుల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోట మూడు నెలల ముందే విడుదల
- సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జులై 12న ఉప ఎన్నిక
- నర్సింగ్ సిబ్బందిని అభినందించిన నర్సింగ్ డైరెక్టర్
- యూఏఈలో కొత్త లోన్ స్కామర్లు, నకిలీ వాట్సాప్ జాబ్స్ ఫ్రాడ్స్..!
- ఇజ్రాయెల్ పై చర్య తీసుకోవాలి.. సౌదీ క్రౌన్ ప్రిన్స్