తాను పండించిన కూరగాయలను దుబాయ్ పంపనున్న MS ధోని...
- January 02, 2021
ఝార్ఖండ్:టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత వ్యవసాయం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాను పండించిన ఆ కూరగాయలను దుబాయ్ కి పంపనున్నాడు ధోని. తన ఫామ్ హౌస్లో పండించిన కూరగాయలను దుబాయ్కు పంపించడానికి సన్నాహాలు కూడా చివరి దశలో ఉన్నాయి. దుబాయ్కు కూరగాయలు పంపే ఏజెన్సీని కూడా ఎంపిక చేశారు. అయితే ధోని కూరగాయలను విదేశాలకు పంపే బాధ్యతను జార్ఖండ్ వ్యవసాయ శాఖ తీసుకుంది. ''ఆల్ సీజన్ ఫార్మ్ ఫెష్ ఏజెన్సీ'' ధోని కూరగాయలను దుబాయ్లో విక్రయించనుంది. అయితే ఇదే ఏజెన్సీ ద్వారా జార్ఖండ్ వ్యవసాయ శాఖ గల్ఫ్ దేశాలకు కూరగాయలను పంపిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు కోసం ప్రభుత్వం పనిచేస్తోందని మార్కెటింగ్ కమిటీ అధిపతి అభిషేక్ ఆనంద్ తెలియజేశారు. ధోని ఒక బ్రాండ్... కాబట్టి అతని పేరుతో కూరగాయలను పంపిస్తే... ఇక్కడి రైతులు కూడా లాభం పొందుతారు. ఇన్ని రోజులు ఇక్కడికి రావటానికి ఇష్టపడని ఏజెన్సీలు కూడా ఇప్పుడు ఇక్కడకు వస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- BCCI Naman Awards: మిథాలీ రాజ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!









