ఖతార్ లో పెరుగుతున్న కరోనా రికవరి రేటు

- January 02, 2021 , by Maagulf
ఖతార్ లో పెరుగుతున్న కరోనా రికవరి రేటు

ఖతార్ కరోనా రికవరి రేటు పెరుగుతోంది. శనివారం కొత్తగా మరో 124 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,41,680 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 198 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల్లో 173 కమ్యూనిటీ కేసులు ఉండగా..25 మంది విదేశాల నుంచి తిరిగొచ్చిన వారు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 1,44,240 మంది వైరస్ బారిన పడగా..ప్రస్తుతం 2,315 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 245 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ వివరించింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com