సింగరేణి కార్మికుల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- January 04, 2021
హైదరాబాద్:సింగరేణి కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని హైదరాబాద్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటినుండి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి సంస్థ అభివృద్ధితోపాటు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం ప్రతినిధులు పలు వినతులను ప్రస్తావించగా, సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఆరెపల్లి రాజేందర్, రాజేశ్వర్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!