గల్‌ఫుడ్‌ 2016ను సందర్శించిన షేక్‌ హమహ్మద్‌

- February 22, 2016 , by Maagulf
గల్‌ఫుడ్‌ 2016ను సందర్శించిన షేక్‌ హమహ్మద్‌

వైఎస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఆదివారం గల్‌ఫుడ్‌ 2016ను సందర్శించారు. ఐదు రోజుల పాటు ఈ ఈవెంట్‌ జరగనుంది. ఫుడ్‌ మరియు హాస్పిటాలిటీ ట్రేడ్‌ ఈవెంట్‌గా గల్‌ఫుడ్‌ నిర్వహించబడుతోంది. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో జరుగుతున్న ఈ వెంట్‌లో 5000 మంది ఎగ్జిబిటర్స్‌ ఫుడ్‌, హాస్పిటాలిటీ రంగం నుంచి తమ తమ ప్రోడక్ట్స్‌ని ప్రదర్శనకు ఉంచారు. ఇందులో 120 అరబ్‌ మరియు ఇతర దేశాలు పాల్గొన్నాయి. ప్రపంచ దేశాలు ఈ ఈవెంట్‌లో పాల్గొనడం పట్ల షేక్‌ మహమ్మద్‌ ఆనందం వ్యక్తం చేశారు. వెస్ట్‌ మరియు ఈస్ట్‌లకు యూఏఈ ఎప్పుడూ గేట్‌వేలా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఎకనమిక్‌, కల్చరల్‌ మరియు స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ నేషనల్‌ ఎకానమీ గురించీ, అలాగే ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాల గురించీ అందరికీ తెలిసేలా చేస్తాయనీ, అలాగే ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయనీ, యూఏఈ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్తాయనీ షేక్‌ మహమ్మద్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com