ఎట్టకేలకు విడుదల అవుతున్న రానా ‘అరణ్య’
- January 06, 2021హైదరాబాద్:టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి బాహుబలి తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంటూ వెళ్తున్నాడు. కాగా రానా నటిస్తున్న ‘అరణ్య’ చిత్రం ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు రానా రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు ప్రభు సోలోమాన్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను గతేడాది వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమాను థియేటర్లు తెరుచుకున్న తరువాతే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. అయితే తాజాగా ఈ సినిమాను మార్చి 26న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఏనుగులతో రానా అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో తమిళ హీరో విష్ణు విశాల్, బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రియా పిల్గాన్కర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ సినిమాతో రానా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం