ఏపీలో కొత్తగా 289 కరోనా కేసులు

- January 06, 2021 , by Maagulf
ఏపీలో కొత్తగా 289 కరోనా కేసులు

అమరావతి:ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.గతంలో వేల సంఖ్యలో కేసులు నమోదవ్వగా, ఇప్పుడు 500 లోపే నమోదవుతున్నాయి.తాజాగా ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 289 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,83,876 కి చేరింది.ఇందులో 8,73,855 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2896 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో ముగ్గురు మృతి చెందారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7125కి చేరింది.   

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com