కువైట్ లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు..నలుగురికి గాయాలు
- January 06, 2021
కువైట్ సిటీ:కువైట్ లో రెండు వేర్వేరు ప్రాంతాలు అగ్ని ప్రమాదాలు సంభవించాయి.ఈ ఘటనలో ముగ్గురు ప్రవాస కార్మికులతో పాటు మరో డొమస్టిక్ వర్కర్ కు గాయాలయ్యాయి. గాయాలైన వారితో పాటు అస్వస్థకు గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు అధికారులు వెల్లడించారు. అల్ నైమ్ ప్రాంతంలో ప్రవాసీయులు ఉన్న ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. అయితే..సమాచారం అందగానే ఫైర్ సెఫ్టీ సిబ్బంది హటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా ఆర్పివేశారు. అయితే..మంట సెగలు, పొగతో ముగ్గురు ప్రవాసీయులు అస్వస్థకు గురవగా..వారికి వెంటనే కావాల్సిన చికిత్స అందించారు. మరోవైపు అల్ ఘరీబ్ ప్రాంతంలో రెండో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వంట గది నుంచి మంటలు వ్యాపించాయని, అయితే..ఇతర గదులకు మంటలు వ్యాపించకముందే ఆర్పివేశామని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో డొమస్టిక్ వర్కర్ ఒకరు అస్వస్థకు గురయ్యారు.
తాజా వార్తలు
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్







