Dh315 మిలియన్ల ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించిన దుబాయ్
- January 06, 2021దుబాయ్:కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొని వ్యాపార రంగం నిలదొక్కుకునేందుకు దుబాయ్ పాలనా యంత్రాంగం తమ శక్తి మేర ప్రయత్నాలను కొనసాగిస్తోంది.ఇందులో భాగంగా వరుసగా ఐదో సారి ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించింది.ఈ సారి Dh315 మిలియన్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్వీట్ చేశారు.దీంతో ఇప్పటివరకు పలు రంగాలకు ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రకటించిన సహాయ ప్యాకేజీ విలువ Dh 7.1 బిలియన్లకు చేరుకుంది.దుబాయ్ రూలర్, యూఏఈ ప్రధాని మార్గనిర్దేశకాలకు అనుగుణంగా ప్రస్తుత ప్యాకేజీని ప్రకటించారు.వచ్చే జూన్ వరకు ఈ ఉద్దీపన ప్యాకేజీని పలు రంగాలకు సహాయంగా అందించనున్నారు.కరోనా ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, అయితే..ఇతర దేశాలతో పోలిస్తే తమ ఆర్ధిక రంగం స్థిరంగా పుంజుకుంటోందని షేక్ హమ్దాన్ వెల్లడించారు. తమ శక్తి సామార్ధ్యాలు, తమకున్న వనరులు...కింగ్డమ్ పరిధిలోని పలు వ్యాపార రంగాలు త్వరతగతిన తిరిగి పంజుకునేందుకు దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ప్రకటించే ప్యాకేజీలు కొత్త ప్యాపారాలకు, కొత్తగా పెట్టుబడులకు అవశమార్గాలుగా మారుతాయనే విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!