తెరుచుకున్న సౌదీ-ఖతార్ సరిహద్దులు..3 ఏళ్ల తర్వాత సౌదీలోకి తొలి కారు
- January 09, 2021
మూడేళ్ల తర్వాత సౌదీ అరేబియా-ఖతార్ సరిహద్దులు తెరుచుకున్నాయి. రెండు గల్ఫ్ దేశాల మధ్య వివాదాలు సమసిపోయి దౌత్య సంబంధాలు పునురుద్ధరించుకున్న తర్వాత..పలు కీలక నిర్ణయాలు వెలువుడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రెండు దేశాల మధ్య విమానాలు, రహదారి సరిహద్దులు, సీ పోర్టుల ద్వారా రవాణా ప్రారంభిస్తున్నట్లు సౌదీ అరేబియాలో ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు శనివారం తొలిసారిగా ఖతార్ నుంచి బయల్దేరిన కారు సాల్వా సరిహద్దు మీదుగా సౌదీ అరేబియాకు చేరుకుంది. అయితే..కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. సాల్వా సరిహద్దు దగ్గర కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖతార్ నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ చూపించాలని..అలాగే కోవిడ్ టెస్ట్ తో పాటు మూడు రోజులు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







