బస్సులు, ట్యాక్సీల కోసం దుబాయ్ లో ప్రత్యేకంగా లేన్లు..ఈ నెల 21న ప్రారంభం
- January 09, 2021
దుబాయ్:పబ్లిక్ ట్రాన్స్ పోర్టులలో ప్రయాణాన్ని మరింత మెరుగు పరిచే దిశగా దుబాయ్ రవాణా సంస్థ కీలక లక్ష్యాన్ని సాధించింది. బస్సులు, ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేన్లను ఈ నెల 21న ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఖలీద్ బిన్ అల్ వలీద్ స్ట్రీట్- అల్ మిన్ స్ట్రీట్ మధ్య తొలిగా ట్రయల్ రన్ ప్రారంభించబోతున్నారు. రహదారి మధ్యలో బస్సులు, ట్యాక్సీలు మాత్రమే వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. బస్సులు వెళ్లే దారిని రెడ్ కలర్ తో మార్క్ చేశారు. మూడో విడత పనుల్లో భాగంగా ప్రస్తుతానికి 4.3 కి.మీ. మేర స్పెషల్ లేన్ లను సిద్ధం చేశారు. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే 11.6 కి.మీ. మేర అల్ మంఖూల్, అల్ ఖలీజ్, ఖలీద్ బిన్ అల్ వలీద్, అల్ ఘుబైబా, నైఫ్, అల్ ఇతిహాద్ మరియు అల్ మినా స్ట్రీట్లలో స్పెషల్ లేన్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రత్యేక రహదారులలో మొత్తం 40 బస్సులు అలాట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికులకు సమయం కలిసి వస్తుందని...దాంతో ప్రైవేట్ వాహనాల వాడకం తగ్గి జనం..ప్రజా రవాణా వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఆర్టీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. స్పెషల్ లేన్ల ద్వారా ప్రయాణికులు గతంలో కంటే 5 నిమిషాల ముందుగా గమ్యాన్ని చేరుకుంటారని, వారి ప్రయాణ సమయం 24 నిమిషాల పాటు ఆదా అవుతుందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







