అదృశ్యమైన విమాన శకలాల గుర్తింపు.. 62మంది జలసమాధి
- January 10, 2021
ఇండొనేషియలో కుప్పకూలిన స్రివిజయ ఎయిర్ లైన్స్ చెందిన బోయింగ్ విమాన శకలాల్ని అధికారులు గుర్తించారు. బోయింగ్ విమానం జావా సముద్రంలో కుప్పకూలిపోయినట్టు నిర్ధారించారు. ఆ విమాన శకలాల్ని థౌజండ్ ఐలాండ్స్ వద్ద గుర్తించారు.
ఈ ప్రమాదం కారణంగా విమానంలో ప్రయాణించిన 62 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. బాధితుల కోసం జాతీయ రవాణా భద్రత కమిటీతో పాటు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజన్సీలు రంగంలోకి దిగాయని ఆ దేశ రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అదిత ఐరావతి తెలిపారు.
కాగా, శనివారం 62 మంది ప్రయాణికులతో రాజధాని జకార్తాలోని సుకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ బోయింగ్ 737-500 విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు కోల్పోయింది. స్రివిజయ ఎయిర్ లైన్స్కు చెందిన ఈ విమానం పాంటియానక్ వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో 56 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
ఫ్లైట్ రాడార్ 24 అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.... టేకాఫ్ అనంతరం 11 వేల అడుగుల ఎత్తుకు చేరిన ఈ బోయింగ్ విమానం ఒక్కసారిగా 250 అడుగుల ఎత్తుకు జారిపోగా, ఆ తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయి జావా సముద్రంలో కూలిపోయింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







