ఇతర దేశాలకు ప్రయాణించే వారికి కొత్త మార్గనిర్దేశకాలు విడుదల చేసిన కువైట్
- January 10, 2021
కువైట్ సిటీ:కువైట్ నుంచి విదేశాలకు ప్రయాణం చేసే పౌరులు, ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ కొత్తగా మార్గనిర్దేశకాలు జారీ చేసింది. కువైట్ నుంచి బయల్దేరే ప్రయాణికుల నుంచి కొన్ని దేశాలు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ఫలితాలను అడుగుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా అగ్నేయ అసియా దేశాలు పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ ను తప్పనిసరి చేశాయని, వాటి అమలును ఖచ్చితంగా పాటిస్తున్నాయనే విషయాన్ని ప్రయాణికులు గుర్తుంచుకోవాలని సూచించింది. కొన్ని దేశాలు అధికారికంగానే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ తో పాటు ఇమ్యూనోలాజికల్ ఎగ్జామినేషన్ ఫలితాలను కూడా అడుగుతున్నాయి. ప్రయాణికుడు గతంలో వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకున్నాడా లేదా అనేది ఇమ్యూనోలాజికల్ ఫలితాల ద్వారా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చైనా పలు జాగ్రత్తలు పాటిస్తోందని, పీసీఆర్ టెస్ట్, ఇమ్యూనోలాజికల్ రిజల్ట్ తో పాటు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్లను కూడా కోరుతోందని తమ దేశం నుంచి ప్రయాణించే ప్రయాణికులకు కువైట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









