ఇతర దేశాలకు ప్రయాణించే వారికి కొత్త మార్గనిర్దేశకాలు విడుదల చేసిన కువైట్
- January 10, 2021
కువైట్ సిటీ:కువైట్ నుంచి విదేశాలకు ప్రయాణం చేసే పౌరులు, ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ కొత్తగా మార్గనిర్దేశకాలు జారీ చేసింది. కువైట్ నుంచి బయల్దేరే ప్రయాణికుల నుంచి కొన్ని దేశాలు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ఫలితాలను అడుగుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా అగ్నేయ అసియా దేశాలు పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ ను తప్పనిసరి చేశాయని, వాటి అమలును ఖచ్చితంగా పాటిస్తున్నాయనే విషయాన్ని ప్రయాణికులు గుర్తుంచుకోవాలని సూచించింది. కొన్ని దేశాలు అధికారికంగానే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ తో పాటు ఇమ్యూనోలాజికల్ ఎగ్జామినేషన్ ఫలితాలను కూడా అడుగుతున్నాయి. ప్రయాణికుడు గతంలో వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకున్నాడా లేదా అనేది ఇమ్యూనోలాజికల్ ఫలితాల ద్వారా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చైనా పలు జాగ్రత్తలు పాటిస్తోందని, పీసీఆర్ టెస్ట్, ఇమ్యూనోలాజికల్ రిజల్ట్ తో పాటు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్లను కూడా కోరుతోందని తమ దేశం నుంచి ప్రయాణించే ప్రయాణికులకు కువైట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







