భారత్ లో కొత్తగా 18,645 కరోనా కేసులు

- January 10, 2021 , by Maagulf
భారత్ లో కొత్తగా 18,645 కరోనా కేసులు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.గతంలో 79 నుంచి 80 వేల వరకు కేసులు నమోదవుతుండేవి.కానీ, ఇప్పుడు 20వేలలోపే నమోదవుతున్నాయి.తాజాగా భారత్ లో 18,645 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,04,50,284కి చేరింది.ఇందులో 1,00,75,950 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,23,335 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 201 కరోనా మరణాలు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,50,999 కి చేరింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com