తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- January 11, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్:తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 224 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 461 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ఇక, మరో ఒక్కరు కరోనాతో మృతిచెందారు..  దీంతో.. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,008కు చేరుకోగా.. ఇప్పటి వరకు 2,83,924 మంది రికవరీ అయ్యారు.. మృతుల సంఖ్య 1566కి పెరిగింది... మరోవైపు.. దేశంలో కరోనా మరణాలశాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి పరిమితం అయ్యింది.. రికవరీ రేటు దేశ్యాప్తంగా 96.4 శాతం ఉంటే.. రాష్ట్రంలో 97.90 శాతానికి పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,518 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో2,439 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com