భారత్ లో తగ్గిన కరోనా కేసులు...
- January 11, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.ప్రస్తుతం కేసులు 20 వేలకు దిగువున నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గుతున్నా,కొత్త కరోనా స్ట్రెయిన్ భయం కారణంగా నిబంధనలు కొనసాగిస్తున్నారు.భారత ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 16,311 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,66,595కి చేరింది.ఇందులో 1,00,92,909 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,22,526 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 161 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,51,160 కి చేరింది.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









