పాప కు జన్మనిచ్చిన అనుష్క..ఆనందంలో విరాట్
- January 11, 2021
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. తన భార్య అనుష్క శర్మ సోమవారం మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ ట్విటర్ వేదికగా తెలిపాడు. మా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అన్నాడు.‘‘ఈ రోజు మధ్యాహ్నం మాకు ఆడబిడ్డ జన్మించిన విషయాన్ని తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. అనుష్క, పాప ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ సమయంలో మాకు కాస్త ప్రైవసీ ఇస్తారని ఆశిస్తున్నా’’ అని విరాట్ ట్వీట్ చేశాడు.
‘జనవరిలో మేం ముగ్గురం కాబోతున్నాం’ అంటూ విరుష్క జోడీ గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ఐపీఎల్ సమయంలో కోహ్లీతో కలిసి అనుష్క దుబాయ్కు వెళ్లారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు కోహ్లీ బయలుదేరగా, అనుష్క స్వదేశానికి తిరిగొచ్చారు. అయితే తన భార్య ప్రసవ సమయంలో తోడుగా ఉండాలని పితృత్వ సెలవులపై విరాట్.. తొలి టెస్టు తర్వాత భారత్కు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, విరుష్క ఒక యాడ్ షూటింగ్లో పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి ప్రయాణం ప్రేమగా మారింది. 2017 డిసెంబర్ 11న ఇటలీలో అతికొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనుష్క గర్భవతి అయిన దగ్గరి నుంచి వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా ఇరువురు అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







