కవలల మృతి: వైద్యుడికి జైలు శిక్ష
- January 13, 2021
బహ్రెయిన్లో ఓ వైద్యుడిని జైలుకు పంపారు. కవలల మృతికి వైద్యుడు కారణమని తేలడంతో ప్రధాన నిందితుడైన డాక్టరుకి మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. ఈ కేసులో మరో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష అలాగే 1,000 దిర్హాముల జరీమానా విధించింది న్యాయస్థానం. కేసు వివరాల్లోకి వెళితే, చిన్నారులు పుట్టిన వెంటనే.. వారు చనిపోయినట్లుగా డాక్టరు చెప్పారననీ, ఆ మృతదేహాల్ని ఖననం చేసేందుకు తీసుకెళ్ళగా, ప్రాణాలతోనే ఆ చిన్నారులు వున్నట్లు కనుగొన్నామనీ, వెంటనే ఆసుపత్రికి తరలించగా, అందులో ఓ చిన్నారి తుది శ్వాస విడిచిందనీ, మరో చిన్నారి వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగిందని విచారణలో తేలింది. ప్రీ మెచ్యూర్డ్ బేబీస్కి వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్య చికిత్స అందించి వుంటే ఇద్దరూ బతికే అవకాశం వుండేదని నిపుణుల కమిటీ తేల్చింది. మెడికల్ నెగ్లిజెన్స్ కింద నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







