కవలల మృతి: వైద్యుడికి జైలు శిక్ష
- January 13, 2021
బహ్రెయిన్లో ఓ వైద్యుడిని జైలుకు పంపారు. కవలల మృతికి వైద్యుడు కారణమని తేలడంతో ప్రధాన నిందితుడైన డాక్టరుకి మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. ఈ కేసులో మరో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష అలాగే 1,000 దిర్హాముల జరీమానా విధించింది న్యాయస్థానం. కేసు వివరాల్లోకి వెళితే, చిన్నారులు పుట్టిన వెంటనే.. వారు చనిపోయినట్లుగా డాక్టరు చెప్పారననీ, ఆ మృతదేహాల్ని ఖననం చేసేందుకు తీసుకెళ్ళగా, ప్రాణాలతోనే ఆ చిన్నారులు వున్నట్లు కనుగొన్నామనీ, వెంటనే ఆసుపత్రికి తరలించగా, అందులో ఓ చిన్నారి తుది శ్వాస విడిచిందనీ, మరో చిన్నారి వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగిందని విచారణలో తేలింది. ప్రీ మెచ్యూర్డ్ బేబీస్కి వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్య చికిత్స అందించి వుంటే ఇద్దరూ బతికే అవకాశం వుండేదని నిపుణుల కమిటీ తేల్చింది. మెడికల్ నెగ్లిజెన్స్ కింద నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- దుబాయ్లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!
- హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్.. ఒమన్ ప్లాన్..!!









