ఆ వలసదారులకు కొత్త జాబ్ వీసా తప్పనిసరి
- January 13, 2021
ఒమాన్: 180 రోజులకు పైగా దేశానికి దూరంగా వుంటోన్న వలసదారులు, తిరిగొ కొత్త జాబ్ వీసా పొందితేనే, దేశంలోకి వారికి ప్రవేశం వుంటుందని అథారిటీస్ పేర్కొన్నాయి. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ ద్వారా ఆయా ఎయిర్ లైన్స్లకు ఈ మేరకు సర్క్యులర్ని పంపించారు. కాగా, డిపెండెంట్ వీసా కలిగినవారికి ఈ నిబంధన వర్తించదు. వారి రెసిడెన్సీ వీసా గడువు తీరితే, వారికి దేశంలోకి ప్రవేశం వుండదు. 6 నెలలకు పైగా ఇతర దేశాల్లో వుండిపోయిన రెసిడెంట్స్, తమ ఎంప్లాయర్ని సంప్రదించి, కొత్తగా జాబ్ వీసా పొందడానికి ఆస్కారం వుంది. ఈ వ్యవహారంపై మరింత స్పష్టత అదికార వర్గాల నుంచి రావాల్సి వుందని ఎయిర్ లైన్స్ సంస్థలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







