ఆ వలసదారులకు కొత్త జాబ్ వీసా తప్పనిసరి
- January 13, 2021
ఒమాన్: 180 రోజులకు పైగా దేశానికి దూరంగా వుంటోన్న వలసదారులు, తిరిగొ కొత్త జాబ్ వీసా పొందితేనే, దేశంలోకి వారికి ప్రవేశం వుంటుందని అథారిటీస్ పేర్కొన్నాయి. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ ద్వారా ఆయా ఎయిర్ లైన్స్లకు ఈ మేరకు సర్క్యులర్ని పంపించారు. కాగా, డిపెండెంట్ వీసా కలిగినవారికి ఈ నిబంధన వర్తించదు. వారి రెసిడెన్సీ వీసా గడువు తీరితే, వారికి దేశంలోకి ప్రవేశం వుండదు. 6 నెలలకు పైగా ఇతర దేశాల్లో వుండిపోయిన రెసిడెంట్స్, తమ ఎంప్లాయర్ని సంప్రదించి, కొత్తగా జాబ్ వీసా పొందడానికి ఆస్కారం వుంది. ఈ వ్యవహారంపై మరింత స్పష్టత అదికార వర్గాల నుంచి రావాల్సి వుందని ఎయిర్ లైన్స్ సంస్థలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..







