కువైట్:విమాన సంస్థలకు ఊరట..పీసీఆర్ టెస్ట్ ఛార్జీల వసూలు నిర్ణయం వాయిదా
- January 15, 2021కువైట్ సిటీ:విమాన సంస్థలకు కువైట్ ప్రభుత్వం కొన్నాళ్ల పాటు ఊరట కల్పించింది. పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను విమాన సంస్థలే భరించాలన్న నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసుకుంది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ప్రస్తుత విధానమే అవలంభించాలని సూచించింది. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన జనవరి 17 నుంచి విమాన ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే పీసీఆర్ టెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే..కువైట్ మంత్రి వర్గ నిర్ణయం మేరకు కువైట్ విమానాశ్రయాల్లో నిర్వహించిన పీసీఆర్ టెస్ట్ ఛార్జీల భారాన్ని ఆయా విమాన సంస్థలే భరించాల్సి ఉంటుంది. కానీ, ఈ నిర్ణయం అమలును కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఇప్పటివరకు అనుసరించిన విధానాన్నే పాటించాల్సి ఉంటుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి