ఖతార్ లో మాస్కులు ధరించని 171 మందిపై లీగల్ యాక్షన్
- January 15, 2021కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు ఆరోగ్య శాఖ పలు చర్యలు తీసుకుంటున్నా...కొందరు వ్యక్తులు మాత్రం అవేం పట్టించుకోకుండా కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మాస్కులు ధరించకపోవటం, వాహనాల్లో పరిమితి మించి ప్రయాణించటం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతుననట్లు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరిగుతున్న 171 మందిపై కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించింది. ఇప్పటివరకు 5,811 మందిపై మాస్కు నిబంధన ఉల్లంఘన కేసులు నమోదైనట్లు తెలిపింది. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణించిన ఘటనలకు సంబంధించి 277 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మసలుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తోటివారి ఆరోగ్య భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ