ఖతార్ లో మాస్కులు ధరించని 171 మందిపై లీగల్ యాక్షన్
- January 15, 2021
కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు ఆరోగ్య శాఖ పలు చర్యలు తీసుకుంటున్నా...కొందరు వ్యక్తులు మాత్రం అవేం పట్టించుకోకుండా కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మాస్కులు ధరించకపోవటం, వాహనాల్లో పరిమితి మించి ప్రయాణించటం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతుననట్లు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరిగుతున్న 171 మందిపై కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించింది. ఇప్పటివరకు 5,811 మందిపై మాస్కు నిబంధన ఉల్లంఘన కేసులు నమోదైనట్లు తెలిపింది. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణించిన ఘటనలకు సంబంధించి 277 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మసలుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తోటివారి ఆరోగ్య భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







