ఖతార్ లో మాస్కులు ధరించని 171 మందిపై లీగల్ యాక్షన్
- January 15, 2021
కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు ఆరోగ్య శాఖ పలు చర్యలు తీసుకుంటున్నా...కొందరు వ్యక్తులు మాత్రం అవేం పట్టించుకోకుండా కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మాస్కులు ధరించకపోవటం, వాహనాల్లో పరిమితి మించి ప్రయాణించటం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతుననట్లు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరిగుతున్న 171 మందిపై కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించింది. ఇప్పటివరకు 5,811 మందిపై మాస్కు నిబంధన ఉల్లంఘన కేసులు నమోదైనట్లు తెలిపింది. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణించిన ఘటనలకు సంబంధించి 277 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మసలుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తోటివారి ఆరోగ్య భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







