ఖతార్ లో మాస్కులు ధరించని 171 మందిపై లీగల్ యాక్షన్
- January 15, 2021
కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు ఆరోగ్య శాఖ పలు చర్యలు తీసుకుంటున్నా...కొందరు వ్యక్తులు మాత్రం అవేం పట్టించుకోకుండా కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మాస్కులు ధరించకపోవటం, వాహనాల్లో పరిమితి మించి ప్రయాణించటం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతుననట్లు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరిగుతున్న 171 మందిపై కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించింది. ఇప్పటివరకు 5,811 మందిపై మాస్కు నిబంధన ఉల్లంఘన కేసులు నమోదైనట్లు తెలిపింది. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణించిన ఘటనలకు సంబంధించి 277 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మసలుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తోటివారి ఆరోగ్య భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..







