పర్యాటకుడి దగ్గర 2కేజీల మత్తు పదార్ధాలు...దుబాయ్ ఎయిర్ పోర్టులో పట్టివేత
- January 15, 2021
దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఓ విజిటర్ నిషేధిత మత్తు పదార్ధాలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. పట్టుబడిన వ్యక్తి పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి అని ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. 26 ఏళ్ల పాకిస్తానీ తనతో పాటు తెచ్చిన పండ్ల బాక్స్ లో మత్తుపదార్ధాలను దాచి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. పండ్ల బాక్సు సైడ్ వాల్స్ సాధారణంగా ఎక్కువ మందంగా ఉండటంతో తమకు అనుమానం వచ్చిందని వివరించారు. బాక్సును పరిశీలించటంతో నిషేధిత మత్తు పదార్ధాలు బయట పడ్డాయని తెలిపారు. చట్ట విరుద్ధమైన డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలపై నిందితుడ్ని అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ కు తరలించామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!







