పర్యాటకుడి దగ్గర 2కేజీల మత్తు పదార్ధాలు...దుబాయ్ ఎయిర్ పోర్టులో పట్టివేత
- January 15, 2021
దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఓ విజిటర్ నిషేధిత మత్తు పదార్ధాలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. పట్టుబడిన వ్యక్తి పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి అని ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. 26 ఏళ్ల పాకిస్తానీ తనతో పాటు తెచ్చిన పండ్ల బాక్స్ లో మత్తుపదార్ధాలను దాచి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. పండ్ల బాక్సు సైడ్ వాల్స్ సాధారణంగా ఎక్కువ మందంగా ఉండటంతో తమకు అనుమానం వచ్చిందని వివరించారు. బాక్సును పరిశీలించటంతో నిషేధిత మత్తు పదార్ధాలు బయట పడ్డాయని తెలిపారు. చట్ట విరుద్ధమైన డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలపై నిందితుడ్ని అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ కు తరలించామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!







