లండన్ తరహా ట్యాక్సీలు దుబాయ్లో అతి త్వరలో
- January 16, 2021దుబాయ్:దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి) త్వరలో లండన్ ట్యాక్సీ సర్వీస్ను ప్రారంభించనుంది. ఫ్యూయల్ అలాగే ఎలక్ట్రిసిటీని ఈ ట్యాక్సీలు వినియోగించనున్నాయి. బ్రిటిష్ రాజధానిలో ట్యాక్సీలు నల్లటి రంగుతో, సెమీ కర్వ్డ్ షేప్లో వుంటాయి. ఫిబ్రవరి నుంచి ఈ వాహనాల్ని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభిస్తారు. ప్రత్యేక క్యాబిన్లో మొత్తం ఆరు సీట్లు ఏర్పాటు చేయబడి వుంటాయి ఈ కారులో. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కోసం కూడా తగిన సదుపాయాలు వుంటాయి. శాటిలైట్ బేస్డ్ నావిగేషన్, వాయిస్ కమాండ్, ఫార్వార్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ డిపాచ్యుర్ వార్నింగ్ సిస్టమ్స్, వైఫై వంటి సౌకర్యాలు ఇందులో పొందుపరిచారు. డ్యూయల్ ఇంజిన్ మరో ప్రత్యేకత. 30 నిమిషాల్లో రీచార్జ్ అయ్యే బ్యాటరీని వీటిల్లో వినియోగిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్