లండన్ తరహా ట్యాక్సీలు దుబాయ్లో అతి త్వరలో
- January 16, 2021దుబాయ్:దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి) త్వరలో లండన్ ట్యాక్సీ సర్వీస్ను ప్రారంభించనుంది. ఫ్యూయల్ అలాగే ఎలక్ట్రిసిటీని ఈ ట్యాక్సీలు వినియోగించనున్నాయి. బ్రిటిష్ రాజధానిలో ట్యాక్సీలు నల్లటి రంగుతో, సెమీ కర్వ్డ్ షేప్లో వుంటాయి. ఫిబ్రవరి నుంచి ఈ వాహనాల్ని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభిస్తారు. ప్రత్యేక క్యాబిన్లో మొత్తం ఆరు సీట్లు ఏర్పాటు చేయబడి వుంటాయి ఈ కారులో. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కోసం కూడా తగిన సదుపాయాలు వుంటాయి. శాటిలైట్ బేస్డ్ నావిగేషన్, వాయిస్ కమాండ్, ఫార్వార్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ డిపాచ్యుర్ వార్నింగ్ సిస్టమ్స్, వైఫై వంటి సౌకర్యాలు ఇందులో పొందుపరిచారు. డ్యూయల్ ఇంజిన్ మరో ప్రత్యేకత. 30 నిమిషాల్లో రీచార్జ్ అయ్యే బ్యాటరీని వీటిల్లో వినియోగిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి