తెలంగాణలో కరోనా కేసుల వివరాలు...
- January 17, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులో స్వల్పంగా పెరిగాయి. నిన్న రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 249 కరోనా కేసులు నమోదు కాగా, ఈరోజు రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,91,666 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,85,898 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,191 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక తెలంగాణలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1577కి చేరింది. నిన్నటి నుంచి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 145 సెంటర్లలో నిన్న కరోనా వ్యాక్సిన్ ను అందించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే









