ప్రజా నటికి-విశిష్ట మాతృమూర్తి జాతీయ పురస్కారం
- January 17, 2021
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి కరకమలముల చే ప్రారంభింపబడిన "రక్ష ఇంటర్నేషనల్ ఫౌండేషన్" హైదరాబాద్, ఇండియా చే జనవరి 16 వ తేదీ సాయంత్రం అంతర్జాలంలో ఊటుకూరు రత్నసుందరి 74 వ జయంతి సందర్భంగా స్వర్ణయుగ ప్రజానటి,పూర్వ పార్లమెంట్ సభ్యురాలు, కళాభారతి డా.జమునా రమణారావుకి "విశిష్ట మాతృమూర్తి జాతీయ పురస్కారం"బహూకరించారు.జమున స్వగృహంలో ఆమె మనుమడు ఆవిడను శాలువా తోనూ,అవార్డ్ తోనూ సత్కరించే వేడుక చూడముచ్చటగా జరిగింది.
ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రక్ష అధ్యక్షులు డా.పసుమర్తి రామలక్ష్మి ఉమాశంకర్ తెలియజేసారు.
గ్రహీత జమున తన జీవితంలో ఎన్నో అవార్డులు పొందినప్పటికీ ఈ "విశిష్ట మాతృమూర్తి" అవార్డ్ పొందలేదన్నారు.ఈ అవార్డ్ తనకు ప్రత్యేక మైనది అని తెలిపారు .ప్రతివారి జీవితంలో వారి మాతృమూర్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది.సుదీర్ఘ సినీ జీవితంలో షూటింగ్ లలో ఎంత బిజీ గా ఉన్నప్పటికీ తన ఇద్దరు పిల్లలను నిర్లక్యం చేయకుండా,చక్కని క్రమశిక్షణతో పెంచినట్లు వివరించారు.అందుకే ఈ అవార్డ్ పొందినందుకు తల్లిగా గర్విస్తున్నానన్నారు.
కార్యక్రమంలో పద్మభూషణ్ డా.కె.ఐ. వరప్రసాద్ రెడ్డి చైర్మన్ శాంతా బయో టెక్నిక్స్,డా.పి.మధుసూదన రావుగారు దూర దర్శన్ పూర్వ డైరెక్టర్,కళా బ్రహ్మ,శిరోమణి వంశీ రామరాజు,డా.కె.శంకరాచార్య ,నాంయాంగ్ యూనివర్సిటీ, సింగపూర్ మరియు రమా రావి వక్తలుగా పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమంలో లక్ష్మీ శ్రీనివాస్ అద్భుతంగా వీణ పాటలు ఆలపించారు.వ్యాఖ్యాత గా సింగపూర్ నుండి మనీషా నిర్వహించారు.ప్రతివారు కన్న తల్లిదండ్రులను పూజిస్తే భగవంతుడు తనను పూజించినట్టు భావిస్తాడని వక్తలందరూ వారి ప్రసంగంలో భావోద్వేగాల నడుమ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..