రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా రాఫెల్ యుద్ధ విమానం
- January 19, 2021భారత వాయుసేన అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం అనదగ్గ రాఫెల్ జెట్ ఫైటర్ ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఫ్రాన్స్ కు చెందిన ఈ అధునాతన యుద్ధ విమానాలు ఇటీవలే భారత్ కు చేరాయి. వీటిలో ఒకదాన్ని జనవరి 26న గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా రాఫెల్ జెట్ విమానం 'వెర్టికల్ చార్లీ' విన్యాసాలు నిర్వహించనుందని వాయుసేన వర్గాలు వెల్లడించాయి.
సాధారణంగా ముందుకు పయనించే విమానాలు... అందుకు భిన్నంగా నిట్టనిలువుగా ఆకాశంలోకి దూసుకెళ్లడాన్నే 'వెర్టికల్ చార్లీ' విన్యాసం అంటారు. ఈ క్రమంలో విమానం మెలికలు తిరుగుతూ అగ్నికీలలను వెదజల్లుతుంది. వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది మాట్లాడుతూ, వెర్టికల్ చార్లీ విన్యాసాల్లో ఒక రాఫెల్ విమానం పాల్గొంటుందని వెల్లడించారు. ఓవరాల్ గా 38 భారత వాయుసేన విమానాలు గణతంత్ర వేడుకల్లో గగన విహారం చేస్తాయని వివరించారు.
తాజా వార్తలు
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్
- 2 రోజులలో 884 విమానాలు రద్దు
- రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్