ఇక నుంచి ఈ-సర్వీస్ ద్వారా జీతాలు...ప్రైవేట్ కంపెనీలకు ఒమన్ ఆదేశాలు
- January 19, 2021
మస్కట్:ఒమన్ లో ఇక నుంచి అన్ని ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు, పేమెంట్ల చెల్లింపులను ఎలక్ట్రానిక్ బ్యాకింగ్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలను ఉద్దేశించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ నోటీసులు జారీ చేసింది. ఈ కొత్త విధానం ఫిబ్రవరి 28 నుంచి అమలులోకి వస్తుంది. అంటే ఇకపై సాంప్రదాయక చెల్లిపులకు అన్ని ప్రైవేట్ సంస్థలు స్వస్తి పలకాల్సిందే. దేశీయంగా జీతాలు, ఇతర పేమెంట్ల చెల్లింపుల విషయంలో పారదర్శకత వేగం పెంచే దిశగా చర్యలు చేపడుతూ నిర్ణయం తీసుకున్న ఒమన్ కార్మిక శాఖ...ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారానే ప్రైవేట్ సంస్థల చెల్లింపులు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సెంట్రల్ బ్యాంక్ కు ఆదేశాలు జారీ చేసింది. మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా సెంట్రల్ బ్యాంకు జనవరి 12న జీతాల చెల్లింపులపై నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ బ్యాకింగ్ అనువుగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని..అదే సమయంలో ఆయా ప్రైవేట్ సంస్థలకు కూడా దీనిపై అవగాహన కల్పిస్తూ చర్యలు చేపట్టాలని కూడా కార్మిక శాఖ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ ను ఆదేశించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







