ఇక నుంచి ఈ-సర్వీస్ ద్వారా జీతాలు...ప్రైవేట్ కంపెనీలకు ఒమన్ ఆదేశాలు
- January 19, 2021మస్కట్:ఒమన్ లో ఇక నుంచి అన్ని ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు, పేమెంట్ల చెల్లింపులను ఎలక్ట్రానిక్ బ్యాకింగ్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలను ఉద్దేశించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ నోటీసులు జారీ చేసింది. ఈ కొత్త విధానం ఫిబ్రవరి 28 నుంచి అమలులోకి వస్తుంది. అంటే ఇకపై సాంప్రదాయక చెల్లిపులకు అన్ని ప్రైవేట్ సంస్థలు స్వస్తి పలకాల్సిందే. దేశీయంగా జీతాలు, ఇతర పేమెంట్ల చెల్లింపుల విషయంలో పారదర్శకత వేగం పెంచే దిశగా చర్యలు చేపడుతూ నిర్ణయం తీసుకున్న ఒమన్ కార్మిక శాఖ...ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారానే ప్రైవేట్ సంస్థల చెల్లింపులు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సెంట్రల్ బ్యాంక్ కు ఆదేశాలు జారీ చేసింది. మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా సెంట్రల్ బ్యాంకు జనవరి 12న జీతాల చెల్లింపులపై నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ బ్యాకింగ్ అనువుగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని..అదే సమయంలో ఆయా ప్రైవేట్ సంస్థలకు కూడా దీనిపై అవగాహన కల్పిస్తూ చర్యలు చేపట్టాలని కూడా కార్మిక శాఖ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ ను ఆదేశించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం