ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

- January 19, 2021 , by Maagulf
ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి: ఏ.పీలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి.  ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 179 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,86,245కి చేరింది.  ఇందులో 8,77,443 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1660 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒక్కరు మృతి చెందారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,142కి చేరింది.  గడిచిన 24 గంటల్లో ఏపీలో 39,099 కరోనా టెస్టులు నిర్వహించారు. 24 గంటల్లో ఏపీలో 231 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు.  

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి, ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com