సౌదీలో జాబ్ చేయాలనుకునే విదేశీ ఇంజనీర్లకు ప్రొఫెషనల్ టెస్ట్ తప్పనిసరి
- January 19, 2021రియాద్:సౌదీ అరేబియాలో జాబ్ చేయాలనుకునే విదేశీ ఇంజనీర్లకు నిబంధనలను కఠినతరం చేసింది స్థానిక ప్రభుత్వం. ఇక నుంచి ప్రొఫెషనల్ టెస్ట్ నిర్ణయించిన తర్వాత కింగ్డమ్ లో జాబ్ వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు..అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వివరాలను, ప్రాక్టికల్ ఎక్స్ పీరిన్స్ ను కూడా పరిగణలోకి తీసుకోనుంది. విద్య, వృత్తి నైపుణ్య శిక్షణ శాఖ ఉన్నతాధికారులు, సౌదీ ఇంజనీర్ల మండలి అధికారులు సౌదీయేతర ఇంజనీర్ల ఉద్యోగాలకు సంబంధించి సమీక్షించారు. కింగ్డమ్ లో ఇంజనీర్లుగా జాబ్ చేసేందుకు ప్రతిభావంతులను మాత్రమే ఎంపిక చేసేలా ఈ కొత్త విధానాలను అమలులోకి తీసుకొచ్చినట్లు అధికారుల ప్రకటించారు. సోసైటి భద్రతకు తమకు అత్యంత ముఖ్యమని ఈ విషయంలో రాజీ ప్రస్తావన ఉండబోదని వెల్లడించారు. ప్రొఫెషనల్ టెస్ట్ క్లియర్ చేసిన వారికే సౌదీ వచ్చేందుకు జాబ్ వీసా మంజూరు చేస్తారని వివరించారు. పీయర్సన్ వీయూఈ భాగస్వామ్యంతో సౌదీ రావాలనుకునే ఇంజనీర్లకు వారి సొంత దేశాల్లోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అత్యున్నత ప్రమాణాలతో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి టెస్ట్ క్లియర్ అయిన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన