ఏపీ డీజీపీ ఓ మోనార్క్లా ప్రవర్తించడం దారుణం:చంద్రబాబు
- January 21, 2021అమరావతి:ఏపీలో వైసీపీ ప్రభుత్వం, డీజీపీలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఉన్మాద పాలనకు టీడీపీ నిరసన తెలియజేస్తోందని పేర్కొన్నారు. కళా వెంకట్రావు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పడం నేరమా? అని నిలదీశారు. రాష్ట్రంలో అమలు చేసేది ఇండియన్ పీనల్ కోడా ? జగన్ పీనల్ కోడా? అని ధ్వజమెత్తారు. రామతీర్థంలో విజయసాయి రెడ్డిని ఏ చట్టం కింద అనుమతించారని నిలదీశారు. అసలు డీజీపీకి లా అండ్ ఆర్డర్ చేయడం వచ్చా అని ప్రశ్నించారు. కోర్టులు చీవాట్లు పెట్టినా తమకు లెక్కలేదన్నారు. ఏ రూల్ కింద కళావెంకట్రావ్ను అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. రాముడు తలను నరికేస్తే తాము వెలితే అడ్డుపడతారా అని ఫైర్ అయ్యారు. తమరు అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తారా.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారా అని మండిపడ్డారు. తిరుపతిలో ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి ఇచ్చి ఇవాళ తిరస్కరిస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు. రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ