రఫేల్ విమానాలు.. భారత్కు యూఏఈ సహాయం!
- January 21, 2021
న్యూఢిల్లీ: రఫేల్ విమానాల తరలింపులో భారత్కు సహాయం చేసేందుకు యూఏఈ ముందుకు వచ్చింది. రఫేల్ విమానాలు గాల్లోనే ఉండగానేన ఇంధనం నింపే విషయమై సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఫ్రాన్స్ బోర్డో-మెరిన్యా వైమానిక స్థావరం నుంచి బయలుదేరనున్న మరో మూడు రఫేల్ విమానాలు త్వరలో నేరుగా భారత్కు చేరుకోనున్నాయి. దాదాపు ఎనిమిది గంటల పాటు ఎక్కడా విరామం లేకుండా సాగే ఈ ప్రయాణంలో భాగంగా ఫైటర్ ప్లేన్లు గాల్లో ఉండగానే ఇంధనం నింపాల్సి ఉంటుంది. దీంతో.. యూఏఈ ఎయిర్ బస్ ట్యాంకర్ను పంపించనుంది. దీని ద్వారా రఫేళ్లకు మార్గమధ్యంలోనే ఇంధనం నింపనున్నారు(రీఫ్యూలింగ్). ఫ్రాన్స్తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా గత ఏడాది ఐదు రఫేల్ విమానాలు భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఎక్కడా ఆగకుండా సాగిన ఈ ప్రయాణంలో రఫేల్ యుధ్ధవిమానాలకు గాల్లో ఉండగానే ఫ్రెంచ్ ఎమ్ఎమ్టీటీ విమానం ద్వారా ఇంధనం నింపారు.
రెండో విడతలో మరో మూడు విమానాలు భారత్కు రానున్నాయి. ఈమారు రీఫ్యూలింగ్ చేసేందుకు యూఏఈ ముందుకు వచ్చింది. యూఏఈ భారత్కు ఇటువంటి సహకారం అందించడం ఇదే ప్రథమమని, ఇరు దేశాల మధ్య బలపడుతున్న దౌత్యబంధానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ ప్రభుత్వం హయాంలో భారత్-అరబ్ దౌత్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఫేల్ విమానాల తరలింపులో యూఏఈ అందిస్తున్న సహకారానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
తాజా వార్తలు
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!







