ఏపీ డీజీపీ ఓ మోనార్క్లా ప్రవర్తించడం దారుణం:చంద్రబాబు
- January 21, 2021
అమరావతి:ఏపీలో వైసీపీ ప్రభుత్వం, డీజీపీలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఉన్మాద పాలనకు టీడీపీ నిరసన తెలియజేస్తోందని పేర్కొన్నారు. కళా వెంకట్రావు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పడం నేరమా? అని నిలదీశారు. రాష్ట్రంలో అమలు చేసేది ఇండియన్ పీనల్ కోడా ? జగన్ పీనల్ కోడా? అని ధ్వజమెత్తారు. రామతీర్థంలో విజయసాయి రెడ్డిని ఏ చట్టం కింద అనుమతించారని నిలదీశారు. అసలు డీజీపీకి లా అండ్ ఆర్డర్ చేయడం వచ్చా అని ప్రశ్నించారు. కోర్టులు చీవాట్లు పెట్టినా తమకు లెక్కలేదన్నారు. ఏ రూల్ కింద కళావెంకట్రావ్ను అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. రాముడు తలను నరికేస్తే తాము వెలితే అడ్డుపడతారా అని ఫైర్ అయ్యారు. తమరు అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తారా.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారా అని మండిపడ్డారు. తిరుపతిలో ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి ఇచ్చి ఇవాళ తిరస్కరిస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు. రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







