బాగ్దాద్ లో ఆత్మాహుతి దాడి..28 మంది మృతి
- January 21, 2021ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఆత్మాహుతి దాడులతో వణికిపోయింది. రెండు వరుస దాడుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోగా మరో 73 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాగ్దాద్లో నిత్యం రద్దీగా ఉండే తయారన్ స్క్వేర్ మార్కెట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆత్మాహుతి సభ్యులు మార్కెట్లోకి దూరి తమను తాము పేల్చుకున్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. జనం భయంతో పరుగులు తీశారు.
ఏం జరిగిందో తెలుసుకునేలోపే మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మార్కెట్లో రక్తపు మద్దలు కనిపించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. కాగా, ఈ దాడికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు.
Absolutely heartbreaking. Twin suicide bombings have hit an open-air #Baghdad market on Thursday. 20 dead and 40 wounded so far. This is the moment of second suicide explosion.#PrayForBaghdad @akhbarpic.twitter.com/HlWvyy2IRM
— Jenan Moussa (@jenanmoussa) January 21, 2021
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు